ఎల్పీజీ లభ్యతపై ఆయిల్ కంపెనీల భరోసా
న్యూఢిల్లీ: ఎల్పీజీ సరఫరాపై ఆందోళన అవసరం లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశాయి. అవసరాల ఆధారంగా ఎల్పీజీ కేటాయింపులు కొనసాగుతాయని తెలిపాయి. దేశవ్యాప్తంగా సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొన్నాయి. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.
Login
Comments (0)