22 నుంచి ఏపిలో 10 వేల కోట్ల ‘తల్లికి వందనం’ నిధుల జమ
ఆంధ్రప్రదేశ్లో ‘తల్లికి వందనం’ పథకం కింద ఈనెల 22 నుంచి 24 వరకు 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120 కోట్లను జమ చేయనున్నారు. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 67,47,190 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. ఈ ఏడాది గ్రామీణ ప్రాంత అంగన్వాడీ కార్యకర్తల పిల్లలను కూడా పథకంలో చేర్చగా, రాష్ట్రవ్యాప్తంగా 17 వేల మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తల పిల్లలు లబ్ధి పొందనున్నారు.
Login
Comments (0)