దాల్మియా విస్తరణ ఏపీపై విశ్వాసానికి నిదర్శనం: లోకేశ్
జమ్మలమడుగు: దాల్మియా భారత్ సిమెంట్ ప్లాంట్ విస్తరణ ఏపీపై పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కడప జిల్లా చిన్నకొమెర్ల సమీపంలో రూ.3,100 కోట్లతో చేపట్టనున్న రెండో ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ విస్తరణకు ముందుకు రావడం రాష్ట్ర పాలన, భవిష్యత్తుపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
Login
Comments (0)