హైడ్రా కేసులో డివిజన్ బెంచ్కు తెలంగాణ సర్కారు
హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ను ఆ పదవి నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్లో సవాల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. హైడ్రా చేపట్టిన ఆక్రమణల తొలగింపు, చెరువుల పునరుద్ధరణ చర్యలను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే కోరనున్నట్లు తెలుస్తోంది. లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించిన ధిక్కరణ కేసుల విచారణలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
Login
Comments (0)