రుషికొండ భవనాల లీజుకు ప్రభుత్వ నిర్ణయం
విశాఖలో రుషికొండ మీదున్న ప్యాలెస్ భవనాలను లీజుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆతిథ్య, పర్యాటక అనుబంధ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ ఏపీటీడీసీ ప్రకటన విడుదల చేసింది. వైసిపి హయాంలో అప్పటి సీఎం జగన్ రూ.452 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ భవనాలు నిర్మించారు. మంత్రుల కమిటీ ఇటీవల ఈ భవనాలను పరిశీలించి, చివరకు ప్రైవేటుకు అప్పగించేందుకు మొగ్గుచూపింది.
Login
Comments (0)